ఏపీలో అర్ధరాత్రి మెరుపు ధర్నాలు

ఏపీలో ప్రజలు అర్ధరాత్రి మెరుపు ధర్నాలు చేస్తున్నారు.

విద్యుత్ కోతలతో విసుగెత్తిన ప్రజలు కర్నూలు, బాపట్ల, కోనసీమ మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో రాత్రి సమయంలో నిరసనలకు దిగారు.

ఈ క్రమంలోనే సబ్ స్టేషన్లను ముట్టడించిన ప్రజలు గంటల తరబడి ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేటలో విజయవాడ - హైదరాబాద్ హైవేపై రాస్తారోకో చేశారు.

ఓ వైపు ఉక్కపోత మరోపక్క కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.అయితే గత రెండు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు