నీటితో దీపాన్ని వెలిగించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి.

ఈ ఆలయాలలో వెలసిన స్వామి వారు స్వయంభుగా వెలిసి ఉండగా మరికొన్ని దేవతల చేత ప్రతిష్టించబడి ఉన్నాయి.

అలాగే మరికొన్ని మహర్షుల చేత దేవతా విగ్రహాలు ప్రతిష్టించబడి విశేష పూజలను అందుకుంటూ ఉన్నాయి.ఈ విధమైనటువంటి ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.

ఈ ఆలయాలలో అనేక వింతలు రహస్యాలు దాగి ఉన్నాయి ఇప్పటికీ ఈ ఆలయాలలో దాగిఉన్న రహస్యాలను చేదించడం ఎవరికి సాధ్యం కాలేదు.ఇలాంటి కోవకు చెందినదే గడియాఘాట్ మాతాజీ మందిరం.

అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున గడియాఘాట్ మాతాజీ ఆలయం ఉంది.

Advertisement

సాధారణంగా అన్ని ఆలయాలలో దేవతలకు నూనె లేదా నెయ్యి వేసి దీపారాధన చేస్తుంటారు.కానీ ఈ ఆలయంలోని అమ్మ వారికి మాత్రం నెయ్యి,నూనె లేకుండా నీటితో దీపాన్ని వెలిగించడం విశేషం.

ఈ విధంగా నీటితో వెలిగే దీపాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటారు.దాదాపు అయిదు సంవత్సరాల క్రితం నుంచి ఈ విధంగా అమ్మవారి ఆలయంలో నీటితో మాత్రమే దీపాన్ని వెలిగిస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.

ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో కూడా అన్ని ఆలయాలలో మాదిరిగానే నూనెతో దీపాన్ని వెలిగించే వారు.కానీ ఒకరోజు అమ్మవారు కలలో కనిపించి తనకు నీటితో దీపాన్ని వెలిగించాలి అని చెప్పినట్లు అక్కడి పండితులు తెలియజేశారు.అప్పటినుంచి ఈ ఆలయంలో అమ్మవారికి కేవలం నీటితో మాత్రమే దీపాన్ని వెలిగిస్తారు.

అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షం ప్రభావం కారణంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం పూర్తిగా మునిగి పోతుంది.అందుకోసమే ఈ ఆలయాన్ని వర్షాకాలంలో మూసివేసి తిరిగి దేవీనవరాత్రుల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
రవితేజ ఎన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు..?

అప్పటి వరకు ఈ ఆలయంలోని దీపం ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది.ఇలా దీపం వెలగడం అంతా అమ్మవారి మహిమేనని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

Advertisement

తాజా వార్తలు