ప్రభాస్ రాధేశ్యామ్ కోసం రంగంలోకి దిగిన కట్టప్ప..!

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం రాధేశ్యామ్.

ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించారు.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇక ఈ సినిమా అన్ని భాషలలో ఒకేరోజు విడుదల కావడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమా కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఇక ఈ సినిమాకి తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఇకపోతే ప్రభాస్ సినిమా కోసం మరొకప్రముఖ నటుడు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తమిళ వెర్షన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కట్టప్ప పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన సత్యరాజ్ రంగంలోకి దిగారు.యు.వి.క్రియేషన్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం కోసం పలువురు స్టార్స్ రంగంలోకి దిగారు.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు