బాలీవుడ్ మాఫియా కింగ్ కరణ్ జోహార్... కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లో సుశాంత్ మరణంతో మొదలైన లొల్లికి కంగనా రనౌత్ అలా ప్రాణం పోస్తూ ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

వీలు దొరికిన ప్రతి సారి బాలీవుడ్ లో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారికి సుశాంత్ మరణంతో లింకులు పెట్టడం, అతని మరణానికి బాలీవుడ్ నెపోటిజం మాఫియా వేధింపులే కారణం అని పదే పదే విమర్శలు చేయడం ద్వారా గట్టిగానే ఇంటెన్సన్ గ్రాబ్ చేస్తుంది.

ఇప్పుడు సుశాంత్ కేసుపై ఓ వైపు సీబీఐ విచారణ జరుగుతూ ఉండగా అక్కడి నుంచి బయటకి వస్తున్న కొన్ని విషయాలని పట్టుకొని మళ్ళీ బాలీవుడ్ మాఫియా అంటూ పదే పదే టార్గెట్ చేస్తుంది.సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలోకి డ్రగ్స్ రావడం, అవి కూడా కీలకంగా మారడం జరిగింది.

దీంతో కంగనా ముందుకొచ్చి బాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా వాడుతారని, బాలీవుడ్ పార్టీలలో డ్రగ్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పుకొచ్చింది.అలాగే డ్రగ్స్ వాడుతున్న వారిలో తనకి తెలిసిన పేర్లు అన్ని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాలో కీలక నేరస్తుడు, మాఫియా కింగ్ కరణ్ జోహార్ అంటూ సంచలన మరో సారి తీవ్ర వాఖ్యలు చేసింది.సినీ మాఫియాకు సంబంధించి అసలు నేరస్తుడు కరణ్ జొహారేనని మండిపడ్డారు.

Advertisement

అనేకమంది జీవితాలను, కెరీర్లను నాశనం చేసిన తర్వాత కూడా అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.అతడిపై చర్యలు తీసుకునేది జరిగే పనేనా అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారం అంతా సద్దుమణిగాక కరణ్, క్రూరమృగాల వంటి అతని గ్యాంగ్ సభ్యులు నావైపు దృష్టి సారిస్తారు అంటూ కంగనా ట్వీట్ చేశారు.సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి జిమ్ లో కసరత్తులు చేసే ఓ వ్యక్తి మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా పైవిధంగా స్పందించారు.

మొత్తానికి కంగనా ఇప్పుడు బాలీవుడ్ అందరిపై విమర్శలు చేస్తూ మళ్ళీ తనకి తానుగా సేఫ్ జోన్ లో ఉండటానికి అన్నట్లు బాలీవుడ్ మాఫియా తనపై దాడి చేస్తారు అంటూ వాఖ్యలు చేస్తుంది.ఈ వ్యాఖ్యాల ద్వారా తనపై ఎలాంటి దాడి జరిగిన దానికి పూర్తి బాధ్యత తాను విమర్శలు చేస్తున్న వారిదే అని ముందుగానే హింట్ ఇస్తుంది.

రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...
Advertisement

తాజా వార్తలు