యాంకర్ రవిని చూసి ఎన్టీఆర్ ఆ మాట అన్నారట.. దాంతో కంగారుపడి?

ప్రముఖ యాంకర్ రవి గురించి అందరికీ తెలిసిందే.బుల్లితెరలో కొన్ని ఛానళ్లలో ప్రసారమవుతున్న షోలలో యాంకరింగ్ చేస్తూ అందరినీ బాగా ఆకట్టుకున్నాడు యాంకర్ రవి.

ఎన్నో ఏళ్లుగా తన యాంకర్ జీవితాన్ని మొదలుపెట్టిన రవి ప్రస్తుతం యాంకర్ ఫీల్డ్ లో బాగా బిజీగా ఉన్నారు.అంతేకాకుండా రవి సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటాడు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అన్న మాటతో రవి కంగారు పడ్డ విషయాన్ని తెలిపాడు.బుధవారం గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ లో జరిగిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ 2021 వార్షిక సదస్సుకు సినీ నటుడు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోను రవి తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.అంతేకాకుండా ఎన్టీఆర్ తనను చూసి బాగున్నారా అని అడగగా ఆ రోజు తనకు తీపిగుర్తు అని రవి తెలిపాడు.

Advertisement

అంతేకాకుండా ఎన్టీఆర్ ను ఏ ట్రూ స్టార్ అని పోస్ట్ చేశాడు.అంతే కాకుండా అక్కడ తను కాస్త కంగారు పడ్డాను నని కూడా తెలిపాడు రవి.ఇక ఈ కార్యక్రమంలో రవి వ్యాఖ్యాతగా చేస్తూ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి గౌరవంగా ఉందని రవి తెలిపాడు.ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు అందరినీ ఆలోచింపజేసేలా ఉండటమే కాకుండా బావోద్వేగం గా కూడా ఉందని తెలిపాడు.

ఇక ఎన్టీఆర్ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ అత్యంత ప్రమాదకర వైరస్ అయినా కరోనాకు వ్యాక్సిన్ ఉంది కానీ రోడ్డు ప్రమాదాలకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని తెలిపాడు.ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు ఓ సారి మీ కోసం ఎదురు చూసే మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలని గుర్తుంచుకోండి అంటూ దేవుడు అన్ని వైపులా ఉండడని, వారికి బదులే తల్లిదండ్రులు ఉన్నారని అంతే కాకుండా విద్య నేర్పిన గురువులను, మన కోసం దేశ సరిహద్దులో ఉన్న సైనికులను, దేశం లోపలో ఉన్న రక్షక పోలీసుల సేవలను గుర్తుంచుకోవాలని తెలిపారు.అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల కారణంగా తన అన్నయ్య, తండ్రిని కోల్పోయిన విషయాన్ని భావోద్వేగంతో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు