సుధీర్ నా రూ.15 లక్షలు ఇస్తావా లేదా.. నటుడు కామెంట్స్ వైరల్?

జబర్దస్త్ మానేసిన తర్వాత అవకాశాలు లేక రోడ్డున పడి అసలు ఏ ఆధారం లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుదీర్ జాలిపడి 15 లక్షలు సాయం చేస్తే, ప్రముఖ కమెడియన్ వేణు వాటితో కాలక్షేపం చేశారని ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఆ విషయం అంతటా వ్యాపించింది.

కానీ రావాల్సిన ఆ 15 లక్షలు మాత్రం రాలేదని కమెడియన్ వేణు చెప్పుకొచ్చారు.ఇకపోతే యూట్యూబ్ లో పెట్టిన ఆ వార్తకు మాత్రం లక్షల వ్యూస్ వచ్చాయి అని ఆయన చెప్పారు.

ఇప్పుడు మరి తనకి ఆ 15 లక్షలు వివరిస్తారని సుధీర్ ని అడిగితే అదేదో ఎవరో రాశారని నవ్వుతూ చెప్పినట్టు వేణు అన్నారు.కనీసం రాసిన వాడైనా తనకు ఆ డబ్బులు ఇస్తే బాగుండేదని ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇక ఎవరైతే యూట్యూబ్ లో అలా రాశారో, వాళ్ళైనా వచ్చి ఈ స్టేట్మెంట్ చూసైనా, ఆ డబ్బులు ఇవ్వాలని అని వేణు అన్నారు.

Advertisement

నిజం చెప్పాలంటే తనకు ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి రాలేదని ఇక రాదు అని ఆయన మన విశ్వాసం వ్యక్తం చేశారు ఎందుకు అంటే ఆయన కీడు ఎంచి మేలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఇక ఆ న్యూస్ విన్న తన అన్న కూడా కాల్ చేసి ఏమయింది అని ఆరా తీసినట్టు ఆయన చెప్పారు.తన భార్య, స్నేహితులు అందరూ కూడా అసలు ఏమైందంటూ ప్రశ్నించారని వేణు చెప్పారు.

కాబట్టి యూట్యూబ్ లో రాసే వాళ్ళు అందరూ నిజాలు తెలుసుకొని రాయాలని విజ్ఞప్తి చేశారు.

ఒకానొక సమయంలో సుమన్ శెట్టి కూడా చనిపోయాడంటూ తప్పుడు వార్తలు రాశారని ఆయన గుర్తు చేసుకున్నారు.ఇలా చేయడం వల్ల వాళ్లకు ఏం వస్తుందో తనకు తెలియదని అన్నారు.ఇలాంటి వార్తలు చూసినప్పుడు ఉండే వాళ్లు ఏమైపోతారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా జబర్దస్త్ లో ఉండే ఓ పదిమంది మాత్రం ఎప్పుడు కలిసి ఉంటామని, ఏ సమస్య వచ్చినా వారందరూ స్నేహితులు కలిసి ఉంటామని ఆయన చెప్పారు.ఇకపోతే 15 కాకపోతే 10 లక్షలైనా ఇస్తే బాగుండేదని ఆయన అన్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు