మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ వాయిదా

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ వాయిదా పడింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో భాగంగా నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.కాగా విచారణలో భాగంగా తన అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో న్యాయస్థానం రేపు విచారిస్తామని వెల్లడించింది.మరోవైపు ఇదే కేసులో నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

ఈ క్రమంలో పునీత్ ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది.

Advertisement
బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!

తాజా వార్తలు