వ్యవసాయ కళాశాల,సిరిసిల్ల నూతన భవన ప్రారంభోత్సవం... అతిథులు వీరే

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల సిరిసిల్ల, నూతన కళాశాల భవనం, బాలుర,బాలికల వసతి గృహల ప్రారంభోత్సవ కార్యక్రమం తేది 12.04-2023 నాడు రాష్ట్ర సమాచార, పురపాలక, పట్టణాభివృద్ధి మరియు పారిశ్రామిక శాఖల మంత్రి.

కె.

తారక రామారావు చేతుల మీదగ జరగనున్నది.ఈ ప్రత్యేక కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, నిరంజన్ రెడ్డి , రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ యొక్క వైస్ చైరమన్ బోయినపల్లి వినోద్ కుమార్ , వ్యవసాయశాఖ కార్యదర్శి, యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ రఘునందన్ రావు గారు, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , రిజిస్టార్ డాక్టర్ సుధీర్ కుమార్ , యూనివర్సిటీ డీన్ డాక్టర్ సీమ , ఇతర జిల్లా, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నారని, వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్, డా॥ టి.ఉమామహేశ్వరి తెలిపారు .ఈ అన్ని వసతులతో కూడిన నుాతన కళాశాల భవనం, బాలుర, బాలికల వసతి గృహలు, వ్యవసాయ క్షేత్రం .కె.తారక రామారావు గారి చేతుల మీదగా ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌కు కీలక పదవి .. టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు

Latest Rajanna Sircilla News