పూరీ, ప్రభాస్ ఓకే అంటే తెలుగు మూవీ చేస్తానంటున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

కంగనా రనౌత్.బాలీవుడ్ స్టార్ హీరోయిన్.చక్కటి సినిమాలు చేస్తూ ఎంత గుర్తింపు తెచ్చుకుంటుందో.

వివాదాలతో అంత కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు మోసిన ఈ హాట్ బ్యూటీ.

గతంలో తెలుగులోనూ ఓ సినిమా చేసింది.ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ మూవీలో నటించింది.

అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.దీంతో ఆమె మళ్లీ తెలుగు సినిమాల జోలికి రాలేదు.

Advertisement

తాజాగా ఈ అమ్మడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి అనే సినిమాలో నటించింది.ఈ వారంలోనే ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది.ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చింది.

ఈ సందర్భంగా టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కంగనా.టాలీవుడ్ లో మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది కంగనా.

తెలుగలో రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.తెలుగు సినిమా చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని దర్శకుడు పూరీని కోరినట్లు చెప్పింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

తన తొలి తెలుగు సినిమాను తెరకెక్కించిన పూరీతోనే మరో సినిమా చేయాలి అనుకుంటున్నట్లు చెప్పింది.అటు ఈ సినిమా హీరోగా చేసిన ప్రభాస్ తోనూ సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.

Advertisement

దర్శకుడు పూరీ, హీరో ప్రభాస్ ఓకే అంటే తెలుగు చేయడం ఖాయమని చెప్పింది.

అటు కంగనా వ్యాఖ్యల పట్ల కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్ను.తన సినిమా తలైవి ప్రమోషన్ కోసం వచ్చింది కాబట్టి ఆమె ఈ పాజిటివ్ కామెంట్స్ చేసిందని చెప్తున్నారు.నిజానికి ఆమెకు తెలుగు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదని చెప్తున్నారు.

గతంలో ఓసారి ప్రభాస్ గురించి తక్కువ చేసిన మాట్లాడిన వీడియోలను వైరల్ చేస్తున్నారు.అయితే గతంలో నెగెటివ్ కామెంట్లు చేసినా.

ప్రస్తుతం తన తలైవి కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ను మచ్చిక చేసుకునేందుకే ఈ కామెంట్స్ అంటున్నారు నెటిజన్లు.

తాజా వార్తలు