నిజంగా ఆ సినిమా రూ.300 కోట్లు రాబట్టిందా?

బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య కాలం లో సౌత్‌ సినిమా ల తో పోల్చితే మినిమం గా కూడా కలెక్షన్స్ ను రాబట్ట లేక పోతున్నాయి.2022 సంవత్సరంలో మొత్తం బాలీవుడ్ లో కలిపి కూడా 3 సినిమా లు కూడా వంద కోట్ల క్లబ్‌ లో చేరలేదు.

కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఆ సినిమా తర్వాత యంగ్ హీరో నటించిన భూల్ భులయ్య సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఇప్పుడు అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల కు పైగా వసూలు నమోదు చేసింది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా 300 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.కానీ దృశ్య 2 సినిమా 300 కోట్ల రూపాయలు క్రాస్ చేసింది అంటే నమ్మశక్యం గా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ సినిమా ప్రముఖులు కొందరు తమ పరువు ను కాపాడుకోవడం కోసం ఈ సినిమా 300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అసలు విషయం ఏంటో కానీ దృశ్యం 2 సినిమా కి వచ్చిన కలెక్షన్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.ప్రస్తుత బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితిని చూస్తే మాత్రం దృశ్యం 2 కు అంత సీన్‌ లేదు అనిపిస్తుంది.

ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 
Advertisement

తాజా వార్తలు