తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావుకు ప్రత్యేక స్థానం ఉంది.రాజకీయాలకతీతంగా హరీష్ రావును ఇతర పార్టీల నాయకులు అభినందిస్తారు.
అయితే ప్రస్తుతం సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిపారు.
అక్కడ అధికారుల నియామకం అవాలంటే నిజాయితీగల ఆఫీసర్ లను మాత్రమే, వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి సిద్దిపేటలో పోస్టింగ్ లభిస్తుంది.అయితే హరీష్ రావుకు నేను మంత్రిని అనే అహం లేకుండా సామాన్యులతోనూ చాలా ఈజీగా కలిసి పోతాడనే పేరుంది.
సామాన్య ప్రజల తోటే కాక జర్నలిస్ట్ లతోనూ మంచి సంబంధాలను కలిగి ఉంటాడు.సీనియర్ జర్నలిస్ట్ లకు అత్యంత గౌరవాన్ని ఇస్తాడు.
అందుకే జర్నలిస్ట్ ల పట్ల పోలీసులు కూడా జాగ్రత్తగా మసులుకుంటారు.కాని నేడు మున్సిపల్ ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్బంగా కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి దిగారు.
అయితే ఈ సందర్బంగా తమపై దాడికి దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావును డిమాండ్ చేస్తామని జర్నలిస్ట్ లు తెలిపారు.అయితే ఎన్నికల వేళ హరీష్ రావు ముందుకు మరో పంచాయితీ వచ్చినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.