రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కొండాపూర్ గ్రామము లో చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సమన్యాయం దక్కుతుందని అన్నారు.
ఈ బిఆర్ఎస్ 9 యేండ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదన్నారు.అలాగే పుట్టబోయే పాపకు 1,50, 000అప్పు చేసి పెట్టాడనీ, దళిత సీఎం లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు, దళిత బంధు కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుంది అని అన్నారు.
వరి వద్దు ఉరి ముద్దు అన్న కేసీఆర్ కు మనం ఉరి వేయాలి అన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
అలాగే పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామనీ,కౌలు రైతులకు 15000 వ్యవసాయ కూలీలకు, 12000 రూపాయలు ఏటా ఇస్తామనీ తెలిపారు.ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని అన్నారు.
అలాగే గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఇస్తామన్నారు.ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలము,ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తామనీ, ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామనీ పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని, యువ వికాసం పథకం కింద ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తామని చేయూత పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు 4000 రూపాయల పింఛన్ అందిస్తామన్నారు.
అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు అందజేస్తాము అన్నారు.మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఉన్నామన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ చెబితే చేస్తుంది దానికి నిదర్శనమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు , యంపిటిసి గుండేల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి కోండాపూర్, మద్దికుంట, గ్రామ శాఖ అద్యక్షులు గంత రాజు,దోనుకుల కోండయ్య, సినియర్ నాయకులు వుచిడి బాల్రెడ్డి క్యారం రాజు, మోహన్ రెడ్డి, పెండ్యాల నారన్ రేడ్డి, సోషల్ మిడియా యారటి భరత్,కనిమేని శ్రీనివాస్, ఏక్కల్ దేవి మహేష్,తటిపేల్లి పద్మరేడ్డి,లక్కిరేడ్డి రాజిరేడ్డి క్యారము రామచేంద్రం, రాజేష్, నవిన్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy