ఎఫ్3పై లెక్క తేల్చేసిన అనిల్

గతేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎఫ్2 చిత్రం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీకి జనం నీరాజనాలు పట్టారు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అప్పుడే ప్రకటించాడు.ఇప్పుడు ఈ సీక్వెల్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే గతకొంత కాలంగా ఈ సీక్వెల్‌లో ఇద్దరు కాకుండా ముగ్గురు హీరోలు ఉంటారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పష్టతనిచ్చింది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోలే ఉంటారని, వారి జీవితంలో జరిగే కథనే ఈ సీక్వెల్‌లో చూపించనున్నట్లు చిత్ర దర్శకుడు తెలిపాడు.వెంకీ, వరుణ్‌ల జీవితాలను మలుపు తిప్పే సంఘటనలు ఈ సినిమాలో మనకు చూపిస్తాడట.

Advertisement

ఇలా ఎఫ్3 సినిమాపై వస్తున్న పుకార్లకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.ఇక త్వరలోనే ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ ఇయర్ సెకండాఫ్ లో సందడి చేయనున్న మన స్టార్ హీరోలు...

Advertisement

తాజా వార్తలు