భక్తితో పూజించేవారికి దేవుడి దయ ఎప్పుడూ ఉంటుంది.దీనికోసం ఉదయం, సాయంత్రం చాలామంది పూలతో పూజ చేస్తూ ఉంటారు.
అయితే పూలతో పూజ చేసినప్పుడు ఏ రకం పులను ఉపయోగించాలనే విషయం చాలామందికి అస్సలు తెలియదు.పూజ చేయడానికి పనికిరాని పూలలో ముఖ్యంగా మొగలిపువ్వు ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
దీనికి కారణం కూడా ఉంది.మొగలి పువ్వును ఎందుకు పూజించకూడదు.
దీని వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వాదన ప్రారంభమైంది.
నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు.

దీనిని తేల్చేందుకు శివుడు( Lord Shiva ) వీళ్ళిద్దరికీ పరీక్ష కూడా పెట్టాడు.తన శివలింగానికి ఆద్యంతాలు కనుక్కొని రమ్మన్నాడు.ఈ పరీక్షకు సరే అన్న బ్రహ్మ, విష్ణువులు శివలింగం అంచులు కనుక్కునేందుకు బయలుదేరి వెళ్లారు.
అయితే ఎంత దూరం ప్రయాణించి వెళ్లినా శివలింగం( Shiv Lingam ) అంచులు కనిపించలేదు.బ్రహ్మకు దేవలోకంలో గోవు, మొగలి చెట్టు కనిపించాయి.ఎంత దూరం ప్రయాణించినా తనకు కనుక్కోవడం కుదరదని అర్థం చేసుకున్న బ్రహ్మ మొగలి చెట్టును గోవును తను ఆద్యంతాలు కనుక్కున్నాను అనే విషయం అబద్ధం చెప్పమన్నాడు.అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి ఓడిపోయాడని బ్రహ్మనే విజేతగా శివుడు ప్రకటిస్తాడు.

ఇదంతా చూస్తున్న ఆకాశవాణి బ్రహ్మ అబద్ధం చెప్పించాడని, దానికి సరేనని మొగలి పువ్వు,గోవు అబద్ధం చెప్పాయి అన్న విషయం విషయాన్ని వివరిస్తుంది.దీనికి ఆగ్రహించిన శివుడు మొగలిపువ్వు పూజకు పనికిరాదని, ఆవు ముఖాన్ని చూస్తే పాపం అని శపిస్తాడు.అందుకే ఏ పూజలలో మొగలి పువ్వును పూజించేందుకు ఉపయోగించరు.అలాగే గోవును ముఖాన్ని కాక వెనుక వైపు నమస్కరిస్తూ ఉంటారు.మొగుడి పువ్వు సున్నితత్వం కలిగి ఉండదు.
చాలా ఎక్కువ వాసనతో వెగటుగా తలనొప్పిని తెచ్చిపెడుతుంది.
ఇది ఉన్న చోట అనుకూల శక్తి ( Positive energy )ఉండదు.ముఖ్యంగా ఈ పూల పదులున్న చోట పాములు కనిపిస్తూ ఉంటాయి.
ఇలా ఎక్కువ వాసన వేసే సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజలలో ఉపయోగించకుండా ఉంటారు.వీటితో పూజ చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటారు.
అలాగే బంతిపూలు కూడా పూజకు ఉపయోగించారు.దీనికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది.