ఇప్పటికి పునీత్ మరణవార్త తెలియని అతని కుటుంబ సభ్యురాలు ఆమెనే !

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఎంతలా దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్టార్ హీరోగా మాత్రమే కాకుండా ఒక మనసున్న గొప్ప వ్యక్తిగా ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ఇ క లేడు అన్న విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.

ఇక పునీత్ రాజ్ కుమార్ను సినిమాలతో చూసుకుంటూ ఎంతోమంది అభిమానులు ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల లోనే ఉన్నారు.అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం పై భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం పునీత్ మేనత్త కి అస్సలు తెలియదట.రాజ్కుమార్ వస్తాడు అని ఇంక ఆమె ఎదురు చూస్తూ ఉందట.

అప్పు ఎప్పుడు వస్తాడు అని అడిగిన ప్రతిసారీ కూడా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారట.పునీత్ రాజ్కుమార్ ఇక లేడని.

Advertisement

నీ దగ్గరకు రాలేడు అని చెప్పలేకపోతున్నారట పూనీత్ కుటుంబ సభ్యులు.అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాడు అని చెబుతున్నారట.

దీంతో ఇక ఎన్నో రోజుల నుంచి పునీత్ రాజ్ కుమార్ కలవటానికి రాకపోవడంతో చివరికి స్క్రీన్ పై మేనల్లుడు ని చూసి మురిసి పోతుంది మేనత్త నాగమ్మ.

ఈ విషయాన్ని ఇటీవలే పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు.పునీత్ మరణవార్త ఇంకా అతని మేనత్త నాగమ్మకు తెలియదని చెబుతున్నారు. 90 ఏళ్ల నాగమ్మ డాక్టర్ రాజ్కుమార్ సోదరి.

వీరి కుటుంబంలో ఆమెనే పెద్ద కావడం గమనార్హం.ఇక నాగమ్మకు మేనల్లుడు అప్పు అంటే ఎంతో ఇష్టం.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

చిన్నతనం నుంచి పునీత్ రాజ్కుమార్ ను నాగమ్మ చూసుకుంది.అయితే కుటుంబ సభ్యులు పునీత్ మరణవార్త విని నాగమ్మ దగ్గర దాచిపెట్టారట.

Advertisement

పప్పు ఎక్కడ అని అడిగితే అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్నాడని చెబుతున్నారట.గతంలోనే రాజ్ కుమార్ కు గుండెపోటు వచ్చిన సమయంలో తట్టుకోలేకపోయారు నాగమ్మ.

ఇప్పుడు పూనీత్ కూడా గుండెపోటు వచ్చి చనిపోయాడని తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడి ఇక ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచారట.

తాజా వార్తలు