మృతిని కుటుంబానికి క్వింటల్ బియ్యం వితరణ

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దూలం పరుశరాములు గౌడ్ 3 రోజుల క్రితము గుండెపోటుతో మరణించడం జరిగింది.

అట్టి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు ఒక క్వింటాల్ బియ్యం ను ఆ కుటుంబానికి అందించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.కార్యకర్తలు ఎవరూ కూడా నిరాశ చెందకూడదని తను అండగా ఉంటానని ధీమా కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాస్,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్,మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మండల బీసీ సెల్ అధ్యక్షులు అగుల్ల రాజేశం, దీటి నరసింహులు, మచ్చ కొండయ్య,తలారి నరసింహులు, చాగల రాజయ్య,గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బాలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

Latest Rajanna Sircilla News