తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కేసీఆర్ చెప్పారన్నారు.
ఇందులో భాగంగానే సింగరేణి అధికారులను పంపి అధ్యయనం చేయాలని చెప్పారని తెలిపారు.ఈ దెబ్బతో కేంద్రం దిగి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ ఫలితంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుంటున్నామని కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు.ప్రైవేటీకరణపై తాత్కాలికంగా కేంద్రం వెనక్కి తగ్గిందన్న కేటీఆర్… కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటదంటూ వ్యాఖ్యనించారు.