లియో హిట్ కోసం కాలినడకన తిరుమల చేరుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్... ఫోటో వైరల్!

తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).

ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో ఈయనకు భారీ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది.

ఇక త్వరలోనే లోకేష్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన లియో సినిమా(Leo Movie) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి.

ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వడం కోసం డైరెక్టర్ లోకేష్ తన బృందంతో కలసి తిరుమల (Tirumala) వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.అయితే ఈయన మెట్ల మార్గంకుండా స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

తన టీంలోని ఓ రైటర్ తిరుమలకు మెట్లు ఎక్కుతుండగా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో విజయ్( Vijay ) సరసన నటి త్రిష( Trisha ) హీరోయిన్ గా నటించబోతున్నారు.ఈ సినిమాలో సంజిత్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ వంటి వారు భాగమవుతున్నారు.ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీగానే అంచనాలు ఉన్నాయి.

అయితే అదే రోజున తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా విడుదల కానున్న నేథ్యంలో ఈ సినిమాల మధ్య గట్టి పోటీ ఉందనే చెప్పాలి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు