టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు(Karumuri Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు(Chandrababu) ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు.
విద్యాదీవెన, చేయూత పథకాలను ఎన్నికల సంఘం ఆపేసిందని మంత్రి కారుమూరి తెలిపారు.దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని పేర్కొన్నారు.
ఫించన్ల పంపిణీలో అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు విద్యాదీవెన, చేయూత పథకాలను(Vidyadivena,ceyuta pathakalanu) అమలు చేయకుండా అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలో చంద్రబాబును ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.
రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.