క్రికెటర్ మనీష్ పాండే భార్య ఓ సినిమా హీరోయిన్..! తెలుసా మీకు..?

భారతీయులు ఏదైనా విషయం గురించి చర్చిస్తున్నారు అంటే అందులో ముఖ్యంగా ఉండే అంశాలు రాజకీయాలు, సినిమాలు, ఆ తర్వాత క్రికెట్.

అయితే సినిమా రంగం సంబంధించిన హీరోయిన్లు క్రికెటర్ల తో కలిసి వివాహం చేసుకున్నవారు ఎందరో.

ప్రస్తుతం టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ కూడా హీరోయిన్ అనుష్క శర్మ ను ప్రేమించి వివాహం చేసుకున్న వారే.అంతేకాకుండా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ లు కూడా హీరోయిన్స్ ని వివాహం చేసుకున్నారు.

వీరే కాకుండా ప్రస్తుతం యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా ఈ లిస్టులో చేరాడు.మనీష్ పాండే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ లో ఆడుతున్నాడు.

ఈయన భార్య కూడా ఒక హీరోయిన్.ఆమె పేరు ఆశ్రిత శెట్టి.

Advertisement

ఈవిడ తెలుగులో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా అయిన ఎన్ హెచ్ 4 లో హీరోయిన్ గా నటించింది.కేవలం సినిమాల్లోనే కాదు అనేక అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఈవిడ నటించారు.

ఎన్ హెచ్ 4 సినిమాలో ఆశ్రిత శెట్టి నటించిన నటనకు సినిమా క్రిటిక్స్ నుంచి అభినందనలను పొందింది.అయితే ఆ తర్వాత మూడు తమిళ సినిమాల్లో ఆమె నటించారు.

ఆ మూడు సినిమాలలో కేవలం రెండు మాత్రమే విడుదల కాగా మరొకటి షూటింగ్ జరుపుకుంటోంది.ఇక మనీష్ పాండే ఆశ్రిత శెట్టి 2019లో ఒకటయ్యారు.

ఆశ్రిత శెట్టి 2010లో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి ఒక సంవత్సరం పాటు ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ గా ఎన్నికయ్యారు.తను 2012లో తులు అనే తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

మన భారతదేశంలో ప్రజలు సినీ స్టార్స్ కు, క్రికెటర్ స్టార్స్ కు ఇచ్చినంత గౌరవం మరెవరికీ ఇవ్వరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి.

Advertisement

తాజా వార్తలు