కంగనాకు దెబ్బ మీద దెబ్బ.. అసలేం జరిగిందంటే..?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత కంగనా ఏం మాట్లాడినా ఆ మాటలు సంచలనం అవుతున్నాయి.

గతంలో మతాలకు సంబంధించిన ట్వీట్లు చేసిన కంగనాకు బాంద్రా కోర్టు మత ద్వేషాలను రెచ్చగొట్టారనే అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న కంగనా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది.

జావేద్‌ అక్తర్ అనే రచయిత కంగనా రనౌత్ పై పరువు నష్టం దావా వేశారు.కంగనా గతంలో బాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వాళ్లను ఎదగనివ్వరని జావేద్ అక్తర్ అలా ఎదగనివ్వకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆరోపణలు చేయడంలో జావేద్ అక్తర్ కంగనాపై పరువు నష్టం దావా వేశారు.

జావేద్ మొదట పోలీసులకు ఫిర్యాదు చేయగా కంగనా పోలీసుల విచారణకు సహకరించలేదు.పోలీసుల విచారణకు కంగనా సహకరించలేదని జావేద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా అంధేరి మేజిస్ట్రేట్‌ కోర్టు కంగనా రనౌత్ కు సమన్లను జారీ చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు కంగనా వరుసగా బయోపిక్ సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement

జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో కంగనా ఇప్పటికే నటించారు.ఇందిరా గాంధీ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కూడా కంగనా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది.

అయితే కంగనా రనౌత్ మాత్రం ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదని పేర్కొంది.తెలుస్తున్న సమాచారం ప్రకారం దేశ రాజకీయాలకు సంబంధించి పీరియాడిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

సాయికబీర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కంగనా రనౌత్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు