గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రయత్నం.. !

గుంటూరు జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్‌లో కలకలం చోటు చేసుకుంది.

ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళ ఎస్సై, కానిస్టేబుల్ వీరిద్దరు కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించడం తో ఈ ఘటన చోటు చేసుకుందట.

ఆ వివరాలు చూస్తే.,/br>గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శ్రావణి, ఇదే పోలీస్ స్టేషన్‌లో గత ఐదేళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారట.

Chundur Si Sravani And Constable Suicide Attempt In Guntur District Guntur Distr

కాగా ఆత్మహత్యాయత్నం తర్వాత వీరిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.అయితే అక్కడి నుండి వారిని మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు అధికారులు.

ఇకపోతే ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వీరిద్దరిద్దరు చాలా సన్నిహితంగా మెలిగేవారని, ఈ క్రమంలో ఏదైన ఊహించని సంఘటన జరిగి ఉండవచ్చని, కానీ పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదని సీఐ రమేశ్‌బాబు తెలిపారు ప్రస్తుతం ఆత్మహత్యకు ప్రయత్నించిన వీరిద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారని, స్పృహలోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామని ఈ సందర్భంగా సీఐ వివరించారు.

Advertisement
ఇది కదరా క్రేజ్ అంటే.. పాకిస్థాన్ బైకులపై '18 విరాట్' (వీడియో)

తాజా వార్తలు