'నేను సాధించుకున్నవి ఆ రెండే..' వినయ విధేయ రామ ఈవెంట్ లో మెగాస్టార్ సంచలన కామెంట్స్!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టిస్తున్న మూవీ విన‌య విధేయ రామ‌.

ఈ మూవీకి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు కాగా, కైరా అద్వాని హీరోయిన్.

ఇక ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో టి ఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కె టీ ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు.-->టీజర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది.ఇక ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల‌కు పిచ్చెక్కిపోతుంది అందరికీ.పక్కా మాస్ హీరో అవతారం ఎత్తాడు మెగా పవర్ స్టార్.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.చిరంజీవి నువ్వు ఏం సాధించావు? అని అడిగితే రెండు అని చెప్పగలను.ఒకటి రామ్ చరణ్, రెండు కోట్లాది మంది అభిమానులు.

Advertisement

సినిమాలకు గ్యాప్ ఇచ్చి.రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా అని ఆలోచించా.అయితే, ‘ఖైదీ నెం.150’ సినిమా తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.మంచి హిట్‌తో నాపై ఉన్న అభిమానాన్ని చాటారు

కేటీఆర్ గారు ఎంత బిజీగా ఉన్నా.ఈ వేడుకకు వచ్చారు.ఆయన నేను బెంచ్ మేట్స్.

వయసులో తేడా ఉంది బెంచ్ మేట్స్.ఏంటి అనుకుంటున్నారా.? మేమిద్దరం అసెంబ్లీలో బెంచ్ మేట్స్.చాలా వినయంగా ఉండేవాడు.

అసలైన వినయ విధేయ రామ ఆయనే అనుకున్నాను.కానీ ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్ధుల నోళ్లు మూయించగల డైనమిక్ పెర్సన్.

" అని అన్నారు.

Advertisement