ప్రకృతి వనం పేరును బాపు పేరున మార్చండి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రకృతి వనం పేరును స్వర్గీయ కీర్తిశేషులు మాజీ ఎంపీపీ నేవూరి వెంకట్ రెడ్డి బాపు పేరిట మార్చాలని ఎల్లారెడ్డిపేట మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ సత్తయ్య కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.

అదేవిధంగా వెంకట్ రెడ్డి పాలరాతి విగ్రహాన్ని ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లోని నెహ్రూ విగ్రహం ఎదురుగా డివైడర్ మధ్యలో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని వినతిపత్రం లో కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలరాజ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గుర్రపు రాములు, వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, బుచ్చి లింగి సంతోష్ గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ , కొన్నే పోచయ్య లు వినతిపత్రాన్ని కార్యదర్శి దేవరాజు కు అందజేశారు.

జిల్లాలో అక్రమ గంజాయి పై జిల్లా పోలీస్ ఉక్కుపాదం

Latest Rajanna Sircilla News