మాజీ వార్డు సభ్యురాలను పరామర్శించిన చక్రధర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ జర్నలిస్టు బండారి బాల్ రెడ్డి తల్లి మాజీ వార్డు సభ్యురాలు బండారి లక్ష్మి గత పక్షం రోజుల క్రితం ఇంటి లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక విరిగి గాయపడింది మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించారు.

ఈ సమాచారం తెలుసుకున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ కనమేని చక్రధర్ రెడ్డి , ముస్తాబాద్ ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్ రావు , మాజీ సర్పంచ్ కిషన్ రావు లు శుక్రవారం తన నివాసంలో కలిసి వారు పరామర్శించారు.

వారి కి మనోధైర్యాన్ని కల్పించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం..

Latest Rajanna Sircilla News