ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినపల్లి మండలం కొత్తపేటలో పద్మశాలి సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో నూలుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులు స్థానిక రామాలయంలో సామూహిక యజ్ఞోపపీతం (జంధ్యాలు ధరించారు) నిరహించారు.

ఆలయ అర్చకులు జంధ్యాలకు ప్రత్యేక పూజలు చేసి పద్మశాలి కులస్తులకు ఇవ్వగా వారు నూతన జంధ్యాన్ని ధరించారు.

అంతం ముందు పద్మశాలి కులస్తులు రామాలయం( Ram temple )లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భజనలతో ఊరేగింపుగా పురవీధులు తిరుగుతూ రాఖీ పౌర్ణమి( Raksha Bandhan ) ప్రాముఖ్యతను తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ద్యావనపల్లి శ్రీహరి, బోయనపల్లి మండల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిందం వేణు,ఆలయ కమిటీ అధ్యక్షులు గుండె కార్ల రమేష్,ద్వావన పల్లి కమలాకర్, దుంపెటి రాములు, ద్యావనపల్లి రవీందర్ ,ద్యావనపల్లి విటల్, చిందం కృష్ణ హరి, దుంపేటి లక్ష్మీనారాయణ, దుంపేటి కర్ణాకర్, ఆడెపు భూమయ్య,ద్యవనపల్లి వెంకటేశం, బూర్ల ఫణీంద్ర, దుంపెటి సాగర్ లు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News