కేసు పెట్టిన మరుక్షణం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియా చక్రవర్తి

సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెపోటిజమ్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది.

కొంత మంది అతని మరణాన్ని బాలీవుడ్ లో స్టార్ వారసుల కుటుంబాలకి అంటగట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు.

అయితే అతను మానసిక వ్యధతో చనిపోయాడు అని వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కూడా ఫైనల్ గా ఇదే తేల్చారు.

అయితే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న సుశాంత్ కుటుంబం సడెన్ గా ఇప్పుడు తెరపైకి వచ్చి సుశాంత్ చనిపోవడానికి ముందు వరకు ప్రేయసిగా ఉన్న రియా చక్రవర్తిపై కేసు పెట్టారు.సుశాంత్ చనిపోవడానికి రియానే కారణం అని పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సుశాంత్ నుంచి ఆమె 15 కోట్లు రూపాయిలు దోచుకుందని, అతనిని తీవ్ర మానసిక క్షోభకి గురిచేసిందని, ఆమెతో పరిచయానికి ముందు సుశాంత్ కి ఎలాంటి మానసిక సమస్యలు లేవని పేర్కొన్నారు.సుశాంత్ కి వచ్చిన సినిమా అవకాశాలని ఆమె కావాలనే అడ్డుకునేదని, తనని హీరోయిన్ గా తీసుకుంటేనే ఆ సినిమాలో నువ్వు నటించాలి అంటూ కండిషన్స్ పెట్టేదని ఫిర్యాదులో సుశాంత్ తండ్రి పేర్కొన్నారు.

Advertisement

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.అయితే ఈ విషయం తెలిసిన వెంటనే రియా చక్రవర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.

పాట్నా పోలీసు స్టేష‌న్‌లో రియాపై కేసు ఫైల్ అయిన క్ష‌ణం నుంచి రియా ఆచూకీ లేన‌ట్లు తెలుస్తోంది.రియా ఇంటికి పోలీసులు వెళ్తే అక్క‌డ ఆమె లేన‌ట్లు తెలిసింది.

ఫోన్ చేసినా కూడా రియా ఆచూకీ తెలియ‌రాలేదు.ఆమెకి నోటీసులు పంపించేందుకు పోలీసులు ఓ వైపు సిద్ధం కాగా ఈ లోపే రియా చ‌క్ర‌వ‌ర్తి ముందస్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

అడ్వ‌కేట్ స‌తీష్ మాన్‌షిండే ఆమె త‌ర‌పున బెయిల్ ద‌ర‌ఖాస్తు చేయ‌నున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం అంటూ బాలీవుడ్ పెద్దల నుంచి రియా మెడకు చుట్టుకోవడంతో ఇప్పుడు ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

అయితే ఈ కేసుపై రియా ఎలా స్పందిస్తుంది.సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలకి ఏం సమాధానం చెబుతుంది అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు