కెరియర్ కోసం విలన్ గా మారబోతున్న అర్జున్ కపూర్

బాలీవుడ్ లో నెపోటిజం ఉందని కొంత మంది అదే పనిగా విమర్శలు చేస్తున్నా సెలబ్రిటీ ఫ్యామిలీల నుంచి వచ్చిన నటుల కెరియర్ చూస్తే అది ఎంత మాత్రం వాస్తవం కాదని అనిపిస్తుంది.

బోనీ కపూర్ లాంటి లెజెండ్ నిర్మాత ఫ్యామిలీ నుంచి అర్జున్ కపూర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

హీరో అయిన తర్వాత కొంత కాలం అతనికి అవకాశాలు భాగానే వచ్చినా తరువాత వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండటంతో కెరియర్ పూర్తిగా గాడి తప్పింది.సినిమాలు చేస్తున్నా కూడా ఎక్కువగా కాంబినేషన్, ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే సినిమాలే చేస్తున్నాడు.

వాటిలో కూడా హిట్ అవుతున్నవి చాలా తక్కువ అర్జున్ కపూర్ చివరిగా పానిపట్ అనే పీరియాడికల్ హిస్టరీ రిలేటెడ్ సినిమాలో నటించాడు.ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉంటే గాడి తప్పిన కెరియర్ ని మరలా దారిలో పెట్టుకోవడానికి అర్జున్ కపూర్ ఇప్పుడు కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలన్ గా నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.అందులో భాగంగా మోహిత్ సూరి దర్శకత్వంలో 2014లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏక్ విలన్ చిత్రం సీక్వెల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

దో విలన్ అనే టైటిల్ తో సినిమా రూపొందుతుంది.ఈ సినిమాలో హీరోగా జాన్ అబ్రహం నటించబోతుండగా దిశా పటానీ, తారా సుతారియా లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ గా కనిపిస్తాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మొత్తానికి నిర్మాత కొడుకుగా వచ్చి బాలీవుడ్ లో విలన్ గా టర్న్ తీసుకుంటున్న హీరోలలో అర్జున్ కపూర్ కూడా ఒకరుగా భవిష్యత్తులో మారబోతున్నాడు అని బి-టౌన్ లో వినిపిస్తున్న టాక్.

Advertisement

తాజా వార్తలు