బాలీవుడ్ లో మొదలైన రిలీజ్ ముసలం... డేట్స్ కోసం పోటీ?

మీకు తెలిసిందే లాక్ డౌన్ వలన అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.ఇక సినిమా పరిశ్రమ అయితే షూటింగ్ దశలో ఉన్న సినిమాలు అనీ ఆగిపోయాయి.

తద్వారా నిర్మాతలు భారీగా నష్టపోయారు.కరోనా తర్వాత ఆగిన సినిమాలు అన్నీ షూటింగ్ పూర్తి చేసుకుని వరుసగా రిలీజ్ అవుతూ వచ్చాయి.

కొన్ని సినిమాలు అయితే రిలీజ్ చేయడానికి ఇతర సినిమాల నుండి పోటీ ఉండడంతో వెనక్కు తగ్గడం ఇలా క్లాసెస్ జరుగుతూ వచ్చాయి.దీనిపైన వివాదాలు కూడా జరగడం తెలిసిందే.

ఆ తర్వాత నిర్మాతలు అంత కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకున్నారు.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లోనూ ఈ సమస్య వచ్చిందట.

Advertisement

కరోనా తర్వాత పెద్ద పెద్ద సినిమాలు ఏవీ బాలీవుడ్ లో రిలీజ్ కాలేదన్న విషయం తెలిసిందే.చిన్న చితకా రిలీజ్ అయినా ఫెయిల్యూర్ ను సొంతం చేసుకున్నాయి.

ఇప్పుడు అన్ని సినిమాలు వరుసగా రిలీజ్ కు పోటీ పడుతున్నాయి.అయితే రిలీజ్ కు రెడీ గా ఉన్న వారిలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్ మరియు కరణ్ జోహార్ ల సినిమాలు ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానున్నాయి .అయితే ఎవరి సినిమా ఎప్పుడు అన్నదానిపై ఇప్పుడు గందరగోళం ఏర్పడింది.ఇందులో ముందుగా అక్షయ్ కుమార్ మరియు అమీర్ ఖాన్ లు థియేటర్ లో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇందులో అక్షయ్ మరియు భూమి పెడ్నేకర్ లు జంటగా నటించిన రక్షా బంధన్ ఆగష్టు రెండవ వారంలో రిలీజ్ కానుంది.అయితే అమీరేఖం మరియు కరీనా కపూర్ లు నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ కూడా ఎప్పటి నుండో వాయిదా పడుతూ ఆగష్టు 11 కే వచ్చి చేరింది.

ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు రానున్న నేపథ్యంలో ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే.మరో థియేటర్ పోటీ ఏకంగా బాలీవుడ్ కు మరియు సౌత్ సినిమాకు ఉంది అని చెప్పాలి.తమిళ్ లో బిగ్ హిట్ అయినా విక్రమ్ వేదను హిందీలో హృతిక్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు కలిసి చేశారు.

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 30 న విడుదల అవుతుందని తెలుస్తోంది.ఇక అదే రోజున తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం చేస్తున్న పొన్నియన్ సెల్వం మూవీ కూడా రిలీజ్ అవనుంది.

ఇందులో విక్రమ్ మరియు ఐశ్వర్యారాయ్ లు లీడ్ రోలెక్ చేస్తున్నారు.ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండడమే విక్రమ్ వేదకు అడ్డంకిగా మారింది.మరి వీటిలో ఏ సినిమా ఎవరికి దారి ఇవ్వనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.

రెండు సినిమాల మీద కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా మరో ఇంటరెస్ట్ క్లాష్ అందరినీ ఆలోచింపచేస్తోంది.అది కూడా బాలీవుడ్ నిర్మాత దర్శకుడు అయిన కరణ్ జోహార్ కు మరియు హీరోయిన్ కంగనా రనౌత్ కు మధ్యన ఉండబోతోంది.మీకు తెలిసిందే కంగనకు కరణ్ జోహార్ అంటేనే అస్సలు పడదు.

నిత్యం అతనిపై విమర్శలు చేస్తూ ఉంటుంది.కరణ్ చేసిన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి సినిమాతో కంగనా పోటీ పడనుంది.

ఈ సినిమాలో రాజ్ కుమార్ మరియు జాన్వీ కపూర్ లు నటిస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 7 న రిలీజ్ కానుంది.

కాగా సరిగ్గా కంగనా మూవీ తేజస్ కూడా అక్టోబర్ 9న రిలీజ్ చేయడానికి చూస్తోంది.మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరో సూపర్ హీరోలు ఇద్దరూ పోటీ పడనున్నారు.అజయ్ దేవగణ్ మరియు అక్షయ్ కుమార్ లు అని తెలుస్తోంది.అజయ్ దేవగన్ మరియు సిద్దార్ద్ మల్హోత్రా లు నటించిన లైఫ్ డ్రామా మూవీ దీపావళికి రిలీజ్ అవనుంది.

ఇందులో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేస్తోంది.ఇక ఇదే దీపావళికి అక్షయ్ కుమార్ సినిమా రామ్ సేతు మూవీ రానుంది.

ఇక ఈ క్లాష్ నుండి ఎవరు తప్పుకుంటారు అన్నది క్లారిటీ లేదు.సంవత్సరం చివర్లో వచ్చే పండుగ క్రిస్టమస్ తో సినిమా పండుగ పూర్తి కానుంది.

అయితే ఈ సారి క్రిస్టమస్ కు ముగ్గురు హీరోలు పోటీ పడనున్నారు.వారిలో రణ్ వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ మరియు విజయ్ సేతుపతి లు ఉన్నారు.

రణ్ వీర్ సింగ్ మరియు రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కస్ ఈ క్రిస్ట్మస్ కు రానుంది .తమిళ హీరో విజయ్ సేతుపతి మరియు కత్రినా కైఫ్ లు నటించిన మెర్రీ క్రిస్మస్ కూడా ఇదే రోజున థియేటర్ లో సందడి చేయనుంది.ఇక టైగర్ ష్రాఫ్, కృతి సనన్ లు జంటగా వస్తున్న చిత్రం గణ్ పథ్. ఇది కూడా క్రిస్ట్మస్ కు రిలీజ్ కానుంది.మరి వీరి ముగ్గురిలో ఏ సినిమా హిట్ అవుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది .

తాజా వార్తలు