వైరల్: ఆటోలో చూసినా మెట్రోలో చూసినా ఈ బాలీవుడ్ భామే కనిపిస్తోంది... విషయం ఏంటి?

అలనాటి బాలీవుడ్ డ్రీమ్‌ గర్ల్ ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని( Hema Malini ) గురించి చెప్పడానికి పదాలు సరిపోవు.

అప్పట్లో కుర్రకారు హేమ అంటే పడిచచ్చేవారు.

ఆమె ఎక్కువగా సింపల్‌ లైఫ్ గడపటానికి ఇష్టపడతారు.కుటుంబంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎప్పటికీ ఆమె ఓ సాధారణ మనిషిలాగానే జీవిస్తుంది అనడానికి ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలే కారణం.

అవును, ఆమెకి కారు, బంగ్లాలు ఉన్నప్పటికి ఓ సాధారణ మహిళలా ముంబైలోని మెట్రోరైల్‌లో( Mumbai Metro ) ప్రయాణం చేశారు హేమమాలిని.

అంతేకాకుండా ఆటో రిక్షాలో( Auto Rickshaw ) ప్రయాణం చేసి తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకున్నారు హేమమాలిని.అప్పట్లో తన అందం, అభినయంతో చిత్ర పరిశ్రమలో డ్రీమ్ గర్ల్‌గా పేరు, ప్రఖ్యాతలు సంపాధించుకున్న నటి హేమమాలిని.తాజాగా తన హుందాగా జీవితాన్ని పక్కనపెట్టి సాధాసీదాగా గడిపారు.

Advertisement

ఇంట్లో లగ్జరీ కార్లు ఉన్నప్పటికి ముంబైలోని ఆటో రిక్షాలో పయనించడం కొసమెరుపు.అయితే హేమమాలిని ఇలా ఎందుకు చేశారో తెలియదు కాని.

ఆమె సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా సంస్థలను ఉపయోగించుకున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం విశేషం.

ముందుగా ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్లి తరువాత ముంబై మెట్రో రైల్‌ ఎక్కారు.అక్కడ మెట్రో ట్రైన్‌లో తోటి ప్రయాణికులతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు.వారిచ్చిన కామెంట్స్‌కి ధన్యవాదాలు తెలిపారు మన డ్రీమ్‌గర్ల్.

కారులో దహిసర్ చేరుకోవడానికి 2 గంటలు పట్టిందని.ఆ జర్నీలో బాగా అలసిపోయానని, అందుకే ఆ తర్వాత కారులో కాకుండా తాను మెట్రో రైల్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
గుడ్లు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!!

అంతే కాకుండా మెట్రో ట్రైన్ జర్నీ చాలా సౌకర్యంగా ఉందని.ఆనందదాయకంగా ఉందని డ్రీమ్‌ గర్ల్ ఇన్స్టా హ్యాండిల్‌లో రాసుకొచ్చారు.

Advertisement

ముంబైలో మెట్రోరైల్ నిర్మించే సమయంలో చాలా ఇబ్బందులు వచ్చాయని.కాని ఇప్పుడు పూర్తైన తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఉందని.

ట్రాఫిక్ సమస్య చాలావరకు తొలగిపోయిందని హేమమాలిని పేర్కొన్నారు.

తాజా వార్తలు