బీజేపీవి మనీ పాలిటిక్స్.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో బీజేపీ మనీ పాలిటిక్స్ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ లోటస్ ను గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో చేశారని మండిపడ్డారు.

తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శించారు.రాహుల్ గాంధీ మన్ కీ బాత్ లా స్పీచ్ ఇవ్వడం లేదన్న ఆయన ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర అనేది పొలిటికల్ యాత్ర కాదని, యూనిటీ యాత్ర అని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలు బీజేపీ ఏజెంట్లను ఆరోపించారు.

అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యనించారు.

Advertisement
కూతురు కోసం కొరియా వెళ్లిన ఇండియన్ ఫాదర్.. వీడియో చూస్తే ఫిదా..

తాజా వార్తలు