రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నేతలు కీలక సమావేశం నిర్వహించారు.

ఈ భేటీకి అమిత్ షా, బీఎల్ సంతోష్, యడియూరప్ప, బసవరాజ్ బొమ్మైతో పాటు కిరణ్ కుమార్ వంటి నేతలు హాజరైయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు, అభ్యర్థుల ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు.మరోవైపు తాజాగా పార్టీలో చేరిన ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

అదేవిధంగా రేపు మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనుంది.

అంతేకాకుండా బోర్డు సమావేశానికి ముందే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు