కుల గణనపై బీజేపీ తీవ్ర ఆరోపణలు... నితీశ్ ప్రభుత్వమే టార్గెట్

బీహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ పర్యటన అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

నడ్డా బీహార్ పర్యటన అనంతరం దీనిలో పాటు పలు అంశాలపై బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ విలేకరుల సమావేశం నిర్వహించి రాజకీయాల్లో మరింత వేడి పుట్టించారు.

ఈ నేపధ్యంలోనే ఆయన నితీష్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కుల గణన విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు.జనాభఆ గణన ప్రక్రియ పబ్లిక్‌గా ఉండాలని అన్నారు.

కుల గణనపై ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.రోహింగ్యా ముస్లింల కోసం ప్రభుత్వం ఏమి చేస్తున్నదని సంజయ్ జైస్వాల్ ప్రశ్నించారు.

Advertisement

ఈ విషయాలన్నింటిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.కుల గణనకు సంబంధించి జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఇటువంటి అంశాలన్నింటినీ లేవనెత్తింది.

ఇదిలా ఉండగా ఐపీఎస్‌ల బదిలీపై సంజయ్ జైస్వాల్ తీవ్రస్థాయిలో మాట్లాడుతూ నేరస్థులను నిజాయితీగా పట్టుకున్న వారిని బదిలీ చేయడం దారుణమన్నారు.బిహార్‌ని నిజాయితీ లేని వ్యక్తులు మాత్రమే పారిపాలిస్తుంటారని ఆరోపించారు.

డీజీపీ ఆర్‌ఎస్‌ భట్టిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయన ఆశించిన విధంగా చేయలేకపోయారని పేర్కొన్నారు.మంత్రుల ఆస్తుల సమాచారాన్ని ఉదహరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ సీఎం తేజస్వీ యాదవ్‌పై మండపడ్డారు.

తేజస్వి యాదవ్‌ ఒక కంపెనీని ఏర్పాటు చేశారని, దానిలో ఆవు పాలు విక్రయించే వారు మొదలుకొని హోటల్‌ చాణక్య యజమానుల వరకు అందరినీ కలుపుకుని పోయారని తెలిపారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

బీహార్‌లో కుల గణనకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.ఇదిలావుండగా బీహార్‌లో త్వరలో కుల గణన జరగనుందని సమాచారం.ఈ కౌంటింగ్‌ను రెండు దశల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

ఈ గణన జనవరి 7 నుంచి మొదటి దశ ప్రారంభమవనుంది.ఇది జనవరి 21 వరకు కొనసాగనుంది.

ఆ తరువాత, రెండవ దశ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది.మొత్తం బీహార్‌లో కుల ఆధారిత గణన రెండు దశల్లోనూ పూర్తికానుంది.

మే 2023 నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తాజా వార్తలు