ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి,పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికల సమయంలో కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోవడం తో అటు బీజేపీ నేతలు,ఇటు తృణమూల్ నేతలు మృతి చెందారు.
అయితే ఇప్పటికీ ఇరు పార్టీలు ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మతిస్థిమితం కోల్పోయారని ఆ రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ….మమతా కు మతిస్థిమితం లేదని,అందుకే ఆమె ప్రవర్తన సరిగా లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల కొంత మంది వ్యక్తులు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడం తో మమతా బెనర్జీ ఆగ్రహానికి లోనైన సంగతి తెలిసిందే.అయితే ఈ విధంగా మమతా రియాక్ట్ అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
అంతేకాకుండా ఆ సందర్భంలో ఆమె వ్యవహరించిన తీరు మమతా బెనర్జీ నిజస్వరూపానికి నిదర్శనమని దిలీప్ ఘోష్ విమర్శించారు.