సర్కార్ వారి పాటకి సై అంటున్న సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ

ప్రేమ పావురాలు సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపుకు లాగేసుకున్న నటి భాగ్యశ్రీ.ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

దీంతో వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి.అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన క్రమం లోనే ఉన్న ఫలంగా ఈమె సినిమాలకు స్వస్తి చెప్పి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

తెలుగులో కూడా గతంలో యువరత్న రానా సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా భాగ్యశ్రీ నటించింది.హీరోయిన్ గా కూడా ఒక సినిమాలో చేసింది.

అయితే సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మరల చాలా కాలం తర్వాత ముఖానికి రంగేసుకుంది.తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.భాగ్యశ్రీ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది.

ఇదిలా ఉంటే మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ మరో క్రేజీ అవకాశం సొంతం చేసుకున్నట్లు టాక్ నిపిస్తుంది.పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో కూడా ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లిగా సినిమాలో చాలా కీలకమైన పాత్రలో భాగ్యశ్రీ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.తాజాగా చిత్ర దర్శకుడు ఆమెను సంప్రదించి ఆమె పాత్ర గురించి కూడా చెప్పడం జరిగింది అని తెలుస్తుంది.

ఆమె కూడా మహేష్ బాబు తల్లిగా చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

మొత్తానికి రీ ఎంట్రీ ద్వారానే ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలకు తల్లిగా ఆమె పరిచయం కావడం ఆసక్తికరంగా మారింది.సౌత్ లో నదియా తర్వాత స్టార్ నటిగా చరిష్మా తెచ్చుకొనే అవకాశం భాగ్యశ్రీకి ఉందని ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు