మోదీ పర్యటనలో అపశృతి.. కాల్పుల్లో నలుగురు మృతి.. ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌ కు వెళ్లారు.

ఇలా మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ దేశంలో వ్యతిరేకత మొదలైంది.

ఈ నేపధ్యంలో ఆందోళనలు కూడా చెలరేగాయి.ఇలా ఈరోజు పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీయగా, ఈ ఘర్షణలను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో కొంత మంది తీవ్రంగా గాయపడగా, నలుగురు మరణించినట్టు సమాచారం.

ఇదే కాకుండా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలకు దిగారు.ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా ఇద్దరు పాత్రికేయులతో పాటు పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డట్లు తెలుస్తుంది.

మరోవైపు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా చిట్టగాంగ్‌లోనూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.ఈ నేపథ్యంలో నిరసనకారులను అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్ షెల్స్‌, రబ్బర్‌ బులెట్లు ప్రయోగించగా, ఈ ఘటనలో కూడా నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

తాజా వార్తలు