హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల సర్వీసులు మరోసారి నిలిచిపోయాయి.
మెట్రో స్టేషన్ లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడతో అరగంట పాటు ట్రైన్ లు నిలిచిపోయాయి.
ఈ నెల 26 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.దిశ ఎన్ కౌంటర్ పై సినిమా చేస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ తన వద్ద 56 లక్షల అప్పు గా తీసుకున్నాడు అంటూ మియాపూర్ మాతృశ్రీ నగర్ కు చెందిన శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్ నిర్వాహకుడు శేఖర్ రాజు ఫిర్యాదు చేశారు.
రాజ్యసభ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు సోమవారం సమావేశమయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీ ల్లో ఖాళీ గా ఉన్న 1869 బోధన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు.
టిడిపి మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి ప్రశ్నా పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ పై విచారణను చిత్తూరు జిల్లా కోర్టు వాయిదా వేసింది.
ఇగో ఇజం, శాడిజం, ఫ్యాక్షనిజం వ్యక్తి జగన్ అని బీజేపీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఏపీ సచివాలయం రెండు బ్లాక్ ఎదుట సి.పి.ఎస్ ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు.
జగన్ పరిపాలన లో ఏపీకి ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు.
కుతుబ్ మినార్ ను దేవాలయం గా మార్చడం కుదరదు అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ ఇవాళ ఆన్లైన్ లో విడుదల చేసింది.ఆగస్టు నెల కు సంబంధించిన తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ ఆగస్టు నెల టికెట్ల కోటాను విడుదల చేసింది.
తాను హిందువునే అయినప్పటికీ , అవసరమైతే బీఫ్ తింటానని కర్ణాటక మాజీ సీఎం , కాంగ్రెస్ నేత సిద్దిరామయ్య సంచలన ప్రకటన చేశారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా ను తొలగిస్తూ పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ దావొస్ లో జరిగిన మీటింగ్ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1675 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వినియోగదారుల నుంచి సర్వీస్ చార్జీల పేరిట రెస్టారెంట్లు అక్రమంగా బిల్లులు వసూలు చేయడం పై కేంద్రం సీరియస్ అయ్యింది.మేరకు రెస్టారెంట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అడుగడుగున బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,750 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,090 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy