వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పదో రోజు విచారణ కొనసాగుతోంది.
కడప సెంట్రల్ జైల్ లో ముగ్గురు వైసీపీకి చెందిన అనుమానితులను సిబిఐ అధికారులు విచారించారు.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడి అధికారులు సమన్లు జారీ చేశారు.ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ప్రతి నెల జీతాల చెల్లింపు ఆలస్యం అవుతుండడం పై తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు.
ఈనెల 20వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు కొనసాగుతాయని తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
వరుసగా రెండో ఏడాది భారత్ నుంచి హజ్ యాత్ర రద్దు అయ్యింది.ఈ మేరకు భారత్ హజ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది.
వ్యవసాయ , వెటర్నరీ కోర్సుల కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ పాలిసెట్ సమన్వయకర్త రాజేశ్వరి తెలియజేశారు.
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ ప్రజలకు హైపర్ ఆది క్షమాపణలు చెప్పారు.జబర్దస్త్ లో ఓ స్కిట్ లో వాడిన డైలాగులు అభ్యంతరకరంగా ఉండడంపై ఉద్రిక్తత పరిస్థితులు ఎదురవడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
టెన్త్ , ఇంటర్ పరీక్షలను జూలై లో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ఏపీ సీఎం జగన్ కు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా ఏడో రోజు లేఖను రాశారు.రైతుబంధు ఈ పథకం ప్రస్తుతం ఇస్తున్న పన్నెండు వేల ఐదు వందలు పాటు అదనంగా వెయ్యి, కేంద్రం ఇచ్చే ఆరువేల తో కలిపి 19,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాలీవుడ్ నటుడు, ప్రముఖ బిజెపి నాయకుడు మిథున్ చక్రవర్తి ని కోల్కతా పోలీసులు వర్చువల్ విధానం ద్వారా విచారించారు.పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈ విచారణ జరిగింది.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వైద్య విధుల్లో పాల్గొనే తమపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఈనెల 18న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని జాతీయ వైద్యుల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో తమిళనాడులోనూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ఆరు లక్షలు దాటింది.
బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువు ముగియడంతో ఇకపై బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి.
తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలను అతి త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఎడ్ సెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 22 వరకూ తెలంగాణలో పొడిగించారు.
గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 5,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,410 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,410. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy