హైదరాబాద్ సిటీ లో టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలు వివాదంగా మారాయి.
నిబంధనలకు విరుద్ధంగా నగరంలో టిఆర్ఎస్ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైటెక్ సిటీలో బిజెపి ఆందోళన నిర్వహించింది.
కెసిఆర్ ,కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 67 వ రోజుకు చేరుకుంది.
పేదలకు చెందాల్సిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కొంత మంది టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని బిజెపి నేత విజయశాంతి విమర్శలు చేశారు.
రేపు హెచ్ ఐ సి సి లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రేపు జరగనుంది ఉదయం 10 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది.
నిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు మూసుకుపోయిన పునర్నిర్మించి ఆహారం తీసుకునే విధంగా చేశారు.
టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలోని ఉర్దూ మీడియం , జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ, అరబిక్ భాష అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడిగా గోవిందు నరేష్ మాదిగ ను నియమిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు.
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
నగరంలో మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులకు నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఓ పాగల్ అంటూ బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు.
ప్రజలను నమ్మించి మోసం చేయడంలో జగన్ సిద్ధహస్తుడని సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు.
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ప్రకటించారు
యుటిఎఫ్ చలో సీఎం మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం ఇళ్ల ముట్టడి ధర్మమేనా అంటూ బొత్స ప్రశ్నించారు.
క్యాన్సర్ బాధితుల కోసం మే నెల మొదటి వారం నుంచి కొత్త వాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు.25 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా శ్రీకారం చుట్టారు.
ఇటీవల రాహుల్ గాంధీ పై బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.రాహుల్ గాంధీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్న తప్పు లేదు నీకు అంటూ బాల్క సుమన్ పై జగ్గారెడ్డి మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసి ఇచ్చే ఏ పార్టీతోనైనా తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ నాయకురాలు డీకే అరుణ సవాల్ విసిరారు.జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దాం అంటూ సవాల్ విసిరారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,450 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,860 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy