కార్తికేయ సీక్వెల్ లో నిఖిల్ కి జోడీగా అనుపమ

మలయాళీలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ అనుపమ పరమేశ్వరన్.

ఆ సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న ఈ భామకి టాలీవుడ్ లో చాలా వేగంగా అవకాశం వచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది.ఇక శతమానం భవతి సినిమాతో ఫుల్ లెంత్ హీరోయిన్ గా సక్సెస్ కొట్టిన అనుపమ తర్వాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది.

తన కళ్ళతో అభినయాన్ని, రొమాన్స్ ని పలికించే అనుపమకి టాలీవుడ్ లో మంచి ఫాన్స్ ఉన్నారు.ఇదిలా ఉంటే హీరోయిన్ గా అనుపమ తన మార్క్ చూపించిన సాలిడ్ సక్సెస్ మాత్రం రాలేదు.

దీంతో హీరోయిన్స్ పోటీలో వెనుకబడిపోయింది.రష్మిక, పూజా హెగ్డే లాంటి భామలు వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిపోతే అనుపమ అవకాశాలు లేక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తుంది.

Advertisement

సింగర్ గా, రైటర్ గా, యాక్టర్ గా మల్టీ టాలెంట్ ఉన్న ఈ భామ తెలుగులో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది.రాక్షసుడు సినిమా రూపంలో హిట్ వచ్చిన అది ఆమె కెరియర్ కి ఎంత మాత్రం ఉపయోగపడలేదు.

ఈ నేపధ్యంలో ఊహించని విధంగా ఆమెకి సీక్వెల్ రూపంలో అవకాశం వచ్చింది.యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ కి సీక్వెల్ ని ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమని దర్శకుడు తీసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.మరి ఇంది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాలి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

Advertisement

తాజా వార్తలు