పక్కా లోకల్ అంటూ రెచ్చిపోయిన అనసూయ..!

తన నటనతో, డాన్సుతో, అందంలోనూ కుర్రకారును మతిపోగొట్టే వ్యక్తి యాంకర్ అనసూయ.అనసూయ వెండితెర అయినా సరే, బుల్లితెర అయినా సరే డాన్స్ వేసిందంటే షేక్ అవ్వాల్సిందే.

అది యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్.వెండితెరపై కూడా అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కనిపించే అనసూయ ఆవిడ చేసే డాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.

అయితే తాజాగా మరోసారి బుల్లితెరపై తన అందాలను ప్రదర్శిస్తూ మంచి మత్తెక్కించే స్టెప్పులతో కుర్రకారుని రెచ్చగొట్టింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

దసరా ఉత్సవాల్లో భాగంగా జీతెలుగు తాజాగా దసరా ఈవెంట్ నిర్వహించింది.ఈ ఈవెంట్ లో భాగంగా అనసూయ రచ్చ మామూలుగా చేయలేదు.

Advertisement

ఈ దసరాకు బుల్లితెరపై అసలైన పండుగ వాతావరణం వచ్చినట్లు కనబడుతుంది.ప్రతి ఛానల్ లో ఓ స్పెషల్ ఈవెంట్స్ జరుగుతుండగానే జీ తెలుగులో కూడా ఈ ఈవెంట్ ను జరిపించారు.

ఇకపోతే దసరా పండగను వివిధ ఛానల్స్ వారు వివిధ రకాల పేర్లతో ఈవెంట్స్ ను నిర్వహించారు.ఇందులోభాగంగానే స్టార్ మా ఛానల్ వారు జాతరో జాతర, ఈటీవీ వారు అక్క ఎవరే అతగాడు, జెమిని ఛానల్ వారు పెళ్లి చూపులు, జి తెలుగు ఛానల్ వారు చి.ల.సౌ.శ్రీముఖి, చి.ప్రదీప్ అనే ఓ స్పెషల్ ఈవెంట్ చేశారు.జీతెలుగు లో నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో యాంకర్ అనసూయ, జానీ మాస్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా కనబడుతున్నారు.

ఇక జీ తెలుగులో ప్రస్తుతం నాగబాబు బొమ్మ అదిరింది షో చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ షోకి నాగబాబుతో సహా ఆయన కుమార్తె నిహారిక కూడా పాల్గొని వారి స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

ఇందులో భాగంగానే యాంకర్ అనసూయ తాను పక్కా లోకల్ అంటూ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది.ఆ తర్వాత జానీ మాస్టర్ లేడీ గెటప్ వేసి తన నటనను ప్రదర్శించాడు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

అయితే ఈ ట్రైలర్ లో అనసూయ వేసిన మాస్ స్టెప్పులు కుర్రకారును ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు