Purandeswari : కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలి..: పురంధేశ్వరి

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.

రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల్లో పొత్తులు తప్పలేదని చెప్పారు.

మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని తెలిపారు.

వ్యవస్థలను వైసీపీ( YCP ) ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు.భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని మండిపడ్డారు.వైసీపీ ప్రభుత్వంలోని అన్ని రంగాల్లోనూ అవినీతే ఉందన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని నేతలకు సూచించారు.కూటమితోనే ఏపీలో రామరాజ్యం వస్తుందని తెలిపారు.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు