ఒకే పార్టీకి హాజరైన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్.. ఆ తర్వాత ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ జోడీలు విడిపోతూ అభిమానులకు భారీ షాకిస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది చైతన్య సమంత జోడీ విడిపోతున్నట్లు చేసిన ప్రకటన అభిమానులను ఎంతో బాధపెట్టింది.

చైసామ్ మళ్లీ కలవాలని అభిమానులు కోరుకున్నా వీళ్లిద్దరూ మళ్లీ కలిసే అవకాశాలు అయితే కనిపించడం లేదు.అయితే చైసామ్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత ధనుష్ ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులు ఆశ్చర్యపోయేలా చేశారు.18 సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న ధనుష్ ఐశ్వర్య విడిపోవటం ఏమిటని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.ధనుష్ తండ్రి సైతం వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన తర్వాత వేర్వేరుగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసగా తెలుగు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డారు.

తాజాగా ధనుష్, ఐశ్వర్య కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు.ఈ పార్టీలో ధనుష్, ఐశ్వర్య మాట్లాడుకుంటారని ఆ పార్టీకి హాజరైన వాళ్లు భావించగా అటు ధనుష్, ఐశ్వర్య అలా భావించిన వాళ్లకు భారీ షాకిచ్చారు.పార్టీలో ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు పట్టించుకోకపోవడంతో ఆశ్చర్యపోవడం ఆ పార్టీకి వచ్చిన వాళ్ల వంతైంది.

Advertisement

చెన్నైలో గ్రాండ్ గా ఈ పార్టీ జరగగా ధనుష్, ఐశ్వర్య కలిసే ఛాన్స్ లేదని ఈ పార్టీతో క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పవచ్చు.కొన్ని రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకే హోటల్ లో ఉన్నప్పటికీ ధనుష్, ఐశ్వర్య ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.

ధనుష్ ప్రస్తుతం సార్ మూవీలో నటిస్తున్నారు.ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని సమాచారం అందుతోంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు