ఎల్లారెడ్డిపేట గిద్ద చెరువులో ఓ వ్యక్తి గల్లంతు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశత్తు మునిగి ఓవ్యక్తి పండుగ పూట గల్లంతు అయిన ఘటన వెలుగు చూసింది.

స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.

ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన ఆనరాశి రాజశేఖర్(35) అనే వ్యక్తి శనివారం ఉదయం 6 గంటలకు చేపలు పట్టేందుకు గిద్ద చెరువులోకి వెళ్ళి చేపలు పడుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాలలోకి కాలుజారి గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈత గాళ్ళ సహాయం తో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News