దేశంలోని ఈ రైల్వే స్టేషన్ నుంచి కాలినడకన విదేశాలకు వెళ్లవచ్చు...

విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తే, ఎవరు వెళ్లకూడదనుకుంటారు? అయితే విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే విమాన ప్రయాణ ఖర్చులు మన మనసులో మెదులుతాయి.అయితే కాలినడకన కూడా విదేశాలకు వెళ్లే ప్రాంతాలు మన దేశంలో అనేకం ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది నిజం.

పొరుగు దేశాల సరిహద్దులలో ఉన్న మనదేశంలోని సరిహద్దు ప్రాంతాల నుండి ఇది సాధ్యమవుతుంది.

ఉదాహరణకు నేపాల్‌కు వెళ్లేలా భారత్‌కు మూడు సరిహద్దులున్నాయి.బీహార్‌లోని అరారియా జిల్లాలోని జోగ్బాని భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్.ఇక్కడ నుండి కాలినడకన నేపాల్‌కు వెళ్లవచ్చు.

ఇప్పుడు మనం విదేశాలకు కాలినడకన వెళ్లగలిగే పశ్చిమ బెంగాల్‌లో‌ని మరొక స్టేషన్ గురించి తెలుసుకుందాం.సింగాబాద్ రైల్వే స్టేషన్ ఇది భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్, దీని పేరు సింగాబాద్.

సింగాబాద్ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతం పరిధిలోకి వస్తుంది.ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న భారతదేశపు చివరి సరిహద్దు రైల్వే స్టేషన్.

Advertisement

ఈ స్టేషన్ బ్రిటిష్ కాలం నాటిది.ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉంది.

సింగాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళితే అక్కడి నుంచి బంగ్లాదేశ్‌ సందర్శించడానికి కొన్ని కిలోమీటర్ల దూరం నడిస్తే సరిపోతుంది.ఈ చిన్న రైల్వే స్టేషన్‌లో చాలా తక్కువ మంది ప్రయాణికులు మాత్రమే కనిపిస్తారు.

ఈ రైల్వే స్టేషన్ గూడ్స్ రైళ్ల రవాణా కోసం ఉపయోగిస్తుంటారు.మైత్రీ ఎక్స్‌ప్రెస్ పేరుతో రెండు ప్యాసింజర్ రైళ్లు ఈ మార్గం గుండా వెళతాయి.స్వాతంత్య్రానంతరం ఈ స్టేషన్ కార్యకలాపాలు ఆగిపోయాయి.

అప్పటి నుంచి ఈ స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది.ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు 1978లో ప్రారంభమయ్యాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అప్పుటి నుంచి మళ్ళీ విజిల్స్ శబ్దం ఇక్కడ ప్రతిధ్వనించడం మొదలయ్యింది.ఇంతకుముందు రైళ్లు భారతదేశం నుండి బంగ్లాదేశ్‌కు మాత్రమే ప్రయాణించేవి,

Advertisement

అయితే 2011 నవంబర్‌లో పాత ఒప్పందాన్ని సవరించిన తరువాత, నేపాల్‌ను కూడా అందులో జత చేర్చారు.ఈ స్టేషన్‌లో స్టేషన్‌కు సంబంధించిన సిగ్నల్‌లు, కమ్యూనికేషన్ ఇతర అవసరమైన పరికరాలు మార్చలేదంటే అక్కడి పరిస్థితిని సులభంగా అంచనా వేయవచ్చు.నేటికీ ఇక్కడ పాత పరికరాలతోనే రైళ్లు నడుస్తుంటాయి.

సిగ్నల్స్ కోసం ఇప్పటికీ ఇక్కడ హ్యాండ్ గేర్లు ఉపయోగిస్తుంటారు.ఇక్కడి టికెట్ కౌంటర్ కూడా మూతపడింది.

ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ కోసం గూడ్స్ రైళ్లు మాత్రమే వేచి ఉంటాయి.ఈ గూడ్స్ రైళ్లు రోహన్‌పూర్ మీదుగా బంగ్లాదేశ్‌ వైపు వెళుతుంటాయి.

తాజా వార్తలు