మహేష్ ఔట్.. దేవరకొండ ఔట్.. పూరీ 'జనగణమన' సినిమా ఏ హీరో చేస్తాడో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్.

ఇడియట్, బిజినెస్ మాన్, పోకిరి, నేనింతే వంటి మాస్ సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలనే తెరకెక్కించాడు.

కొన్ని కొన్ని సార్లు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు పూరీ.అయినా కూడా తన సహనాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి మరి సినిమాలను రూపొందిస్తున్నాడు.

ఇక ఇటీవలే యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాకు తో ముందుకు వచ్చాడు.భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందింది.

Advertisement

కానీ విడుదలైన మొదటి రోజే ఈ సినిమా ప్లాప్ అని ముద్ర వేసుకుంది.దీంతో ఇదే దేవరకొండ తో పాటు పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియాలో బాగా నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.

ఎందుకంటే సినిమా విడుదల కాకముందుకు ఈ సినిమా గురించి జోరుగా ప్రచారాలు చేశారు.పైగా విజయ్ దేవరకొండ మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొట్టి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు.

కానీ ఏముంది.సినిమా విడుదలైన రోజే ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇక ఇదంత పక్కన పెడితే పూరి ఈ సినిమా డిజాస్టర్ అని టాక్ వచ్చినా కూడా ఎక్కడ నిరాశ చెందకుండా నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యాడని తెలుస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇప్పటికే ఆయన ఖాతాలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా గురించి గతంలోనే అనౌన్స్ చేశాడు పూరి.అయితే ఈ సినిమాకు హీరోని పూరి ఎవరిని ఎంచుకున్నాడు అనేది ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది.

Advertisement

అయితే పూరి దర్శకత్వంలో వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలలో మొదట హీరోలను ఒకరు అనుకోని ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామల వల్ల మరో హీరోలను ఫిక్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఇప్పుడు జనగణమన సినిమాకు కూడా పూరి మొదట చిరంజీవిని హీరోగా పెట్టాలని అనుకున్నాడట.

కానీ చిరంజీవి నో అనడంతో తర్వాత మహేష్ బాబుని తీసుకోవాలని అనుకున్నాడట.కానీ మహేష్ బాబు కూడా ఈ సినిమాకి నో చెప్పడంతో.వెంటనే పూరి మైండ్ లోకి విజయ్ దేవరకొండ రావటంతో ఆయన్ని పెట్టి ఎలాగైనా తీయాలి అనుకున్నాడట.

ఇక విజయ్ ఈ ప్రాజెక్టుకి ఒప్పుకోవడంతో.ఈ సినిమాను ముంబైలో ఓపెనింగ్ చేసి.కొంత భాగం షూటింగా కూడా చేశారని తెలిసింది.

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పాలని అనుకోవడంతో.ఈ సినిమాకు బడా బడా నిర్మాతలను కూడా తీసుకున్నట్లు తెలిసింది.

కాని చివరికి ఈ సినిమాని దూరం పెట్టినట్లు తెలిసింది.కారణం లైగర్ సినిమా.

ఈ సినిమా ఫ్లాప్ అని ముద్ర వేసుకోవడంతో.పూరి పై ఆశలు వదులుకున్నారు నిర్మాతలు.

పైగా విజయ్ దేవరకొండను కూడా ఈ సినిమా నుంచి తప్పించినట్లు తెలిసింది.మొత్తానికి ముగ్గురు హీరోలను ఫిక్స్ చేసిన కూడా కాలం కలిసి రాలేదు.

దీంతో ఇప్పుడు అందరికీ మరో ఆలోచన పడింది.పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాకు హీరో ఎవరు ఉంటారు అని.ఏ హీరోని రంగంలోకి దింపుతాడు అని అనుమానాలు వస్తున్నాయి.

తాజా వార్తలు