నాలా పనులను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ హరిష్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్ లోని నాగిరెడ్డి చెరువు నాలా పనులకు,గత వారంలో నలభై ఒక్క కోట్ల రూపాయలతో పనులను, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు.

పనులను పరిశీలించడానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్,ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో కలసి నాలా పనులను పరిశీలించారు.

అనంతరం అధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలోపే పనులను పూర్తి చేసి వర్షం వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ లు సంబందిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వచ్చే వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా నాగిరెడ్డి చెరువు నాలా పనులను పూర్తిచేస్తామని ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఉండేందుకు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నాలా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు