ట్విస్టు ఇచ్చిన ఈట‌ల జ‌మున‌.. పోటీలో ఆమె కూడా ఉందా..?

తెలంగాణ రాజ‌కీయాల‌ను ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు శాసిస్తున్నాయి.ఏ పార్టీలో ఏది జ‌రిగినా అది చివ‌ర‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్య‌మే అని చెప్పాల్సిందే.

ఎందుకంటే ప్ర‌తి పార్టీకి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు పెద్ద స‌వాల్ గా మారిపోయాయి.ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు ఊహ‌కు కూడ ఆంద‌కుండా ఉన్నాయ‌నే చెప్పాలి.

ఎందుకంటే ఎప్ప‌డు ఏ పార్టీలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌ట్లేదు.ఇక ఇదే క్ర‌మంలో ఉప ఎన్నిక‌కు తెర లేపిన ఈటల రాజేందర్ గెలుపు కోసం ఆయ‌న సతీమణి ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నారో అంద‌రికీ తెలిసిందే.

అయితే మొద‌టి నుంచి ఇక్క‌డ ఒక అనుమానం బ‌లంగా వినిపిస్తోంది.అదేంటంటే ఈట‌ల జముననే పోటీ చేస్తుంద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే ఈట‌ల రాజేంద‌ర్ మాత్ర‌మే పోటీ చేస్తార‌నే ప్ర‌చారం బ‌లంగానే సాగుతోంది.అయితే దీనిపై ఇప్ప‌టి దాకా ఈట‌ల కూడా పెద్ద‌గా స్పందించ‌లేదు.

కాగా ఇప్పుడు ఈట‌ల జ‌మున చేసిన వ్యాఖ్యలు పెద్ద ట్విస్టుగా మారాయిఇ.అవేంటంటే పోటీలో తాను ఉన్నా లేదా ఈట‌ల రాజేందర్ ఉన్నా ఒక్కటే పెద్ద తేడా ఏమీ లేద‌ని, ఇద్ద‌ర‌మూ పోటీ చేసే ఆలోచ‌న‌లోనే ఉన్నామ‌ని, ఎవ‌రికి అవ‌కాశం వ‌స్తే వాళ్లం పోటీ చేస్తామంటూ చెబుతున్నారు.

వారిద్ద‌రిలో ఎవరు పోటీ చేసినా కూడా పార్టీ గుర్తు మాత్రం బీజేపీదే ఉంటుంద‌ని, కానీ వారిద్ద‌రిలో ఎవ‌రో ఒక్క మనుషి మాత్ర‌మే మారొచ్చ‌ని ఆమె చెప్ప‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఇక హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ పెడుతున్న డబ్బుల ఖర్చు ఎంత మాత్రం ప‌నిచేయ‌ద‌ని, చివ‌ర‌కు ప్ర‌జ‌లు త‌మ‌నే గెలిపిస్తారంటూ ఆమె చెప్పారు.అయితే జ‌మున చేసిన వ్యాఖ్య‌లు ఆమె కూడా పోటీలో ఉంద‌నే తెలుపుతున్నాయి.

అదే జ‌రిగితే ఇంత వ‌ర‌కు ఎందుకు ప్ర‌క‌టించ‌ల‌దేనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.చూడాలి మ‌రి ఎవ‌రు పోటీ చేస్తారో.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు