అవన్నీ రూమర్లే అంటున్న బండ్ల.. పవన్ తో సినిమా చేయడంలేదట..!

పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించాడు.వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది.ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ ఆయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రం రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుపాటి కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.ఈ మధ్యనే పవన్ కరోనా బారిన పడడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

పవన్ కరోనా నుండి కోలుకున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో షూటింగ్ ఇప్పుడే ప్రారంభించే అవకాశాలు లేవు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయితే ఆ మధ్య పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.పవన్ నుండి బండ్ల గణేష్ గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు.ఆయనతో మరొక సారి సినిమా నిర్మించాలని ఆయన డేట్స్ కోసం గట్టిగ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను రమేష్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.బండ్ల గణేష్ రమేష్ వర్మను పవన్ తో సినిమా చేయడానికి లైన్లో పెట్టాడని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను బండ్ల గణేష్ అవన్నీ రూమర్లే అంటూ ఖండించాడు.

ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఒకవేళ చేస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని ఆయన తెలిపాడు.పవన్ డేట్స్ కోసమే బండ్ల గణేష్ ఎదురు చూస్తున్నాడు.డేట్స్ ఇస్తే ఈ సినిమా వెంటనే సెట్స్ మీదకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

తాజా వార్తలు