పుష్ప తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇక సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తూ ఉండగా బన్నీకి ప్రతినాయకుడుగా మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫైజల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

మరో వైపు రీసెంట్ గా పుష్ప మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.ఈ వీడియోలో అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్షన్ ఎలివేషన్ చూపించారు.

ఈ టీజర్ తో సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా ఉండబోతుందనే విషయాన్ని సుకుమార్ చెప్పేశాడు.రంగస్థలం తర్వాత మరోసారి అలాంటి జోనర్ ని పుష్ప సినిమా కోసం సుకుమార్ ఎంచుకున్నాడని తెలుస్తుంది.

Advertisement

అయితే రంగస్థలంలో కాన్సెప్ట్ అంతా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది.పుష్ప మూవీలో కాన్సెప్ట్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ఉంటుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే పుష్ప సినిమా తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా గురించి టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది.ఈ నేపధ్యంలో పుష్ప పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే రామ్ చరణ్ కి కథ కూడా చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తుంది.

అయితే రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మరి శంకర్-రామ్ చరణ్ సినిమా కంప్లీట్ అయ్యే వరకు సుకుమార్ వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు